21, మార్చి 2015, శనివారం

మామిడాకులు మళ్ళి మళ్ళి రమ్మని పిలుస్తుంటే...
లేత చుగుళ్ళను మేసిన మత్త కోయిల
 కుహు..కుహు ..అంటూ..స్వాగతిస్తూ ఉంటె..
ప్రకృతి కన్య ..శిశిరాన్ని విడిచి వసంతపు కొత్త వలువలు కట్టుకొని..
మల్లెల దండల ద్వారాన వేచి చూస్తుంటే..
చైత్రమాసపు వేప పువుల వగరు వాసనతో..
మదిలో చెలరేగే వలపు చూపుల తూపులతో...
మన్మధ నామదారి అయిన కొత్త వత్సరం..
అరుదెంచె నదిగో..

కామెంట్‌లు లేవు: