10, సెప్టెంబర్ 2015, గురువారం

"కాలం.."

కనిపించదు...
కానీ ..
కదులుతుంది...
వినిపించుకోదు ..
కానీ..
గుబులు రేపుతుంది..
దైవత్వం అయినా...
రాక్షసత్వం అయినా...
జంకు లేక సాగుతుంది..
రాజయినా..పేదయినా..
రెప్ప పాటులో మాయ చేసి..
తనపాటికి తాను తాపిగా ..
నడుచుకుంటూ....
వెళ్ళిపోతూనే ఉంటుంది..
"కాలం.."
ఉపశమన తరంగాలు మిత్రులకు సభ్యులకు శుభ సాయంత్రం.. చిత్రాక్షరి-3 రాదా కృష్ణుల వర్ణన . తృతీయ విజేత శ్రీమతి సుజాత తిమ్మన గారు
Sujatha Thimmana **********రాధామనోహరం*********
మోహనుని కొసచూపుల కవ్వింతలు..
రాధ ఎదలోని ప్రేమామృతధారలను 'చిలుకు'తూ
ఉన్న రాసాస్వాదనల తెలియాడుచూ ..తాను మౌని అయింది..
మురళీధరుని గాన విన్యాసముల గాంచుచూ ..
మధువనిలోని పూ భాలల మధువులు 'ఒలుకు '
ప్రణయ వీవనల స్పర్శలో సర్వం మరచిన సరిజమయింది..
శిఖిపించసరాగాల విలాసములలో..తేలియాడు సఖి
మది గదిలోదాగిన బావాల పరంపరల ' పలుకు 'ల
తేనెల వానలలో తడిచి ముఖుళించిన అరవిందమైంది..
యముననీటి తరగలపై అలవోకగా నడయాడు పూలనావలో..
సఖుని సందిట బందీఅయిన చెలి ఎరుపెక్కిన చెక్కిళ్ళ ‘ కులుకు ‘
మదన తాపమున మాధవుని కదలనీయక విడివడని జాలమయింది..


బుజ్జి తండ్రి..
అమ్మమ్మ వడి నీకు
హంస తూలికా తల్పమేరా..
నా కన్నా....
మీ అమ్మ ఊగిన
ఉయాలే రా..ఇది
నా కన్నా .
జో జో లు కొట్టేను ..
లాలి లాలి అని పాడేను..
అన్ని మరచి నిదుర పోరా..
నా కన్నా..
రాముడై ఎదిగి.
విలు విద్యలే చూపేవో..
ఒక్క మాటపై నిలిచి..
ఇల ధర్మమే నిలిపేవో..
కృష్ణుడిగా మారి..
వెన్న ముద్దలే తినేవో..
గోపెమ్మెల చుట్టూ చేరి..
గోల గోల చేసేవో..
గాజు కన్నుల కలలు
ఫలియింప గాజేసి..
నిండు నూరేళ్ళు
జీవించు తండ్రి..
ఆపైన వెయ్యేళ్ళు
నీ పేరు ..
అమరమై నిలువ..
సిరిని చేపట్టిన వాడు
శ్రీనివాసుడు నిను
కాపాడు గాక..
సమస్తము తానైన
సాయి నాధుడు నిను
సంరక్షించుగాక..
అమ్మమ్మనై నీ ఆలనల
ఆనందాలే పొందేనురా..
నీ ఆయువుల శ్వాసిస్తూ..
నా ప్రేమల .. నిను బందిస్తూ..
నా కన్నా...నా నాన్నవేరా..
చిన్ని తండ్రీ...బజ్జోరా..బుజ్జి తండ్రి..!
..
*********జననీ*************
అర్ధరాత్రి ఆకాశంలోనికి ..ఎగ బాకింది..
"బోలో స్వతంత్ర భారత్ కీ జై.." అన్న నినాదం..
చీకటిని చిల్చు కుంటూ దూసుకెళ్ళే తారాజువ్వై...
జంబూద్వీపమై ..ప్రాచిన సంపదని కాపాడుతూ..
వేదాల సారాలను తనలో ఇముడించుకొని..
సంస్కృతీ సంప్రదాయాలదేవాలయమై నిలిచింది...
తూటాలతో వచ్చి తెల్లదొరలు దేశాన్ని ఆక్రమించి
అరాచకత్వాల ప్రజలను పీడిస్తుంటే.....తమను మరచి
సౌఖ్వం విడిచిన ఎందరో మహానుబావుల త్యాగ ఫలమిది ..
ఆకును సైతం కదలనీయని అహింసాయుతంతో..
సుష్కిస్తున్న శరీరాన్నికూడా లెక్కచేయని సత్యాగ్రహంతో..
గాంధీజీ మాట పై నిలిచి తెచ్చుకున్న స్వాతంత్రమిది..
అక్షరాల గింజలేసి..కార్యదీక్షతో పండిచుకొన్న
ప్రగతి పంటను...భావి భవితకు కానుక చేస్తూ..
పసి హృదయాలలో.. దేశభక్తిని నింపుదాం..
కన్నతల్లి స్తన్యమిచ్చి ఆకలి తీరుస్తుంది..
జన్మభూమి నిచ్చిన భారతమాత..
ఉపిరి ఉన్నంత వరకూ ఊతమిచ్చి..
శ్వాస విడిచిన కాయాన్ని తనలో కలుపుకొంటుంది..
ఆ తల్లిని కాపాడుతూ....మాననీయతతో జీవిద్దాం..!
కదలి పోతున్న
క్షణాల పోగుల రాసులలో..
దాగిన జ్ఞాపకాల నిధివి నీవు..
చూపుల చీనాంబరానికి..
మాటల మాణిక్యాలనతికించి..
ఎదుటివారి హృదయానికి
అలంకరించేవు...
సమన్వయపు సహనము
నీ ఉపిరి..
అందుకే..
ప్రతి వారికీ అనిపిస్తుంది...
నీ సమక్షం..
ఎప్పుడు శాంతి కపోతాల నిలయమని..
అందుకే..
నీ తలపులపెనవేసుకున్న
నా ప్రాణాలు...
లోలోన నీతోనే జీవిస్తూ...
వేచిఉన్నాయి...
నిన్నుచేరే ఘడియకోసం..!


వచ్చినాడమ్మా..
వెన్నదొంగ..
ఎదలోనె దాగి..
దోబూచు కనులతో..
అటు..ఇటు..చూస్తూ..
పెదవులతో సున్నా చుట్టి..
బూరెలంటి బుగ్గలని ఎర్రగా చేసి..
అడుగుకు..అడుగు కలుపుతూ..
వంచిన బుజాల కుదుపుతూ..
నీలి వర్ణమైనా..
నిగనిగల మెరుపులతో..
మిల..మిలల తళుకులతో..
అలా...అలా...మెల్లగా...
చేరి..వచ్చినాడమ్మా....
ఎనక చేరి రెండు కళ్ళుమూసి..
వెన్నంటిన నోటితో...
ఒక్క ముద్దే ఇచ్చినాడమ్మా...
నా చిన్ని కృష్ణుడు..!


జో...జో...
అలకలన్నీ తీరి
అలివేలు మంగ..
అచ్చంగ విభునికి 
అన్ని అర్పించంగ...
కాటుకంటిన శ్రీవారి
బుగ్గలు నిగ్గు తేలంగ
అది చూసి నవ్వింది ..
అమ్మలగన్న అమ్మ..
మురిపెంగా...
సతి సాన్నిధ్యము లోని
సరసాల సౌఖ్యాలు ..
అనుభవములోన మగనికి
ఆనందాల పొదరిళ్ళె...
ఆలు మగల అన్యోనతలోన
మధుమాసానికి... ఎపుడు
ఆవాసమేలే...
పాల కడలి అలల నురగల
తేలేటి శేష తల్పముపైన..
సేద తీరి నట్టి..
చిద్విలాసపు నగవుల
శ్రీనివాసుడ వేలే..
నడిరేయి దాటుతున్నది..
తొలిజాముకు దగ్గరవుతూ..
గుండె సడిలోన గువ్వలా ఒదిగి..
పవ్వళించరా..స్వామి..!
నాశ్వాసలోని నీ నామ జప తెరలోన..
జో..జో...!....జో..జో...!