26, నవంబర్ 2015, గురువారం

సేవించనీ..సేవించనీ....
శ్రీవారి పాద పద్మాల పూజించనీ ..
శ్రీ వెంకటేశ్వరుని అర్చించనీ ....
శ్రీనివాసునికి ..నీరాజనం..
అర్పించనీ..అర్పించనీ....
రమణి ముద్దూగుమ్మ ..
పద్మావతీ అమ్మ..
అలరించి... మురిపించి
అలసి... సొలసిన వేళ
స్వామి..చిధ్విలాసపు
చిరునగవు చిందించుచూ
నిదురించి ఉన్న వేళ ..//సేవించ//
వరహాల మూటలు
నాకేల స్వామి..
నీ విచ్చు అభయహస్తము
కన్నా మిన్న యేమి..
అనునిత్యము.. నీ ధ్యానమే..
మది నింపరా స్వామి..
కను పాపలలో .చెదరని నీ రూపము ..
కంటి నీరై కరుగనీయని వేళ .//సేవించ//
గోవిందా...
గోవిందా అని
పిలిచిన చాలును
జనులారా.... 
పిలుపు పెదవి
దాటకమునుపే
పరుగున వచ్చి
నిలచును హృదయమున
రెప్పలు మూసినా...
కనిపించును స్వామి
కరుణామయుడు..కనరండీ....
శిలగా మారిన స్వామీ
తనను నమ్మిన వారికై....
వెన్నలా కరిగిపోవునే....
వారి జీవితమంతా
వెన్నెలనే కురిపించునే....
గోవిందా అని
పిలచిన చాలును
జనులారా....
ముల్లోకాలకూ అధిపతియై
ప్రజల కాపాడుటకూ
యుగయుగాలనుండీ
అవతారాలెన్నో మార్చెనే....
అభయహస్తమిచ్చి
ఆపదలబాపుచూ
ఈ యుగమందున
వెంకటాద్రిపై వెలిసెనే...
కలియుగ దైవమై నిలిచెనే..
గోవిందా అని
పిలచిన చాలును
జనులారా.....
శ్రీ రంగనాధా...
పలుకులను లోలోన
దాచుకొని..
పవ్వళించితివా..
రంగనాధా...!!
శ్రీ రంగనాధా..!!
ఇహములోన నను
ఇక్కట్లకు గురిచేసి
వేదనతో నే వేడుకుంటున్నా...
వినిపించుకొని కూడా..
చిరునగవుల నీవు..
నా చింతలన్నీ మరచి ... //పలుకులను//
వింజామరల మెల్లగ
వీచేగా..భూదేవి..
సుతిమెత్తగ పాదాలు
వత్తెగా.. శ్రీదేవి..
సపర్యల సల్లాపములలో
సాంతముగా..అన్నీ మరచి....//పలుకులను//
ప్రేమారాదనల మాలలతో...
నిను సేవించీ..పూజించీ..
నిన్నే భర్తగ పొందెనుగా..
గోదాదేవి...
ఆ తల్లి లాలుల ఊయలలో..
సాంతముగా అన్నీ మరచి ......//పలుకులను//
స్వామి చరణాల వాలేదేలా..!!

అభయ హస్త మిచ్చి ఆపదల గాచుచు...
అన్నీ తానై...తలనీలాలను ముడుపుగా చేకొను స్వామి..
గోవింద ...గోవింద ..అని తలచినంతనే..
హృదయంలోనికి పరుగు పరుగున వచ్చి చేరే స్వామి.
.
వైకుంఠముని వీడి ..శేషగిరిపై..శిలగా మారి..
కలి పాపాలనుంచి కాపాడ..వేంకటేశ్వరుడై నిలిచిన స్వామి..
నిత్య కళ్యాణాలతో...పూజా కైంకర్యాలతో..సేవలందుకుంటూ..
క్షణమాత్రం దర్శనం తోనే..జన్మతః పుణ్యఫలం ప్రసాదించు స్వామి..

ఆ స్వామి దివ్య లీలలను వింటూ...ఎప్పుడెప్పుడా ..
శ్రీనివాసుని కన్నుల నిలుపుకొను భాగ్యమని తలపోస్తూఉన్నా..
గుండె గుబులాయె..మరి..ఏడేడు కొండలు ఎక్కాలంటే...
చేతిలో కానీ లేక..చెంతను శక్తి లేక..చేరేదెలా ..?.
స్వామి చరణాల వాలేదేలా..?
సతమతమయ్యే ప్రశ్నలతో..
ఎదతలపులలో ఆ వెంకన్నని నిలుపుకొని..
నిరీక్షిస్తూ ఉన్నా...నిజమయ్యే ఆ ఘడియ కోసం...!
ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః.!
శ్రీ వేంకటేశ్వరుడు
వైకుంఠవాసుడు
శ్రీవేంకటేశ్వరుడు
భగవంతుడు వాడే
పిలిచిన పలికేటివాడు.....
సిరులెన్నొ కలవాడు
శ్రంగార పురుషుడు
శ్రీలక్ష్మి సిగలోన
సిరిమల్లె అయినాడు //వైకుంఠ//
ఏడుకొండెలెక్కి తాను
కొలువై ఉన్నాడు
కోరి వచ్చే వారి..
ఆపద్భాందవుడు //వైకుంఠ//
అల్లనల్లన మెల్లమెల్లగ
అన్నమయ్య హృదయముదోచి
ఆంద్రుల ప్రతి ఇంటను నిలిచి
అవతార మూర్తి అయినాడు //వైకుంఠ//

10, సెప్టెంబర్ 2015, గురువారం

"కాలం.."

కనిపించదు...
కానీ ..
కదులుతుంది...
వినిపించుకోదు ..
కానీ..
గుబులు రేపుతుంది..
దైవత్వం అయినా...
రాక్షసత్వం అయినా...
జంకు లేక సాగుతుంది..
రాజయినా..పేదయినా..
రెప్ప పాటులో మాయ చేసి..
తనపాటికి తాను తాపిగా ..
నడుచుకుంటూ....
వెళ్ళిపోతూనే ఉంటుంది..
"కాలం.."
ఉపశమన తరంగాలు మిత్రులకు సభ్యులకు శుభ సాయంత్రం.. చిత్రాక్షరి-3 రాదా కృష్ణుల వర్ణన . తృతీయ విజేత శ్రీమతి సుజాత తిమ్మన గారు
Sujatha Thimmana **********రాధామనోహరం*********
మోహనుని కొసచూపుల కవ్వింతలు..
రాధ ఎదలోని ప్రేమామృతధారలను 'చిలుకు'తూ
ఉన్న రాసాస్వాదనల తెలియాడుచూ ..తాను మౌని అయింది..
మురళీధరుని గాన విన్యాసముల గాంచుచూ ..
మధువనిలోని పూ భాలల మధువులు 'ఒలుకు '
ప్రణయ వీవనల స్పర్శలో సర్వం మరచిన సరిజమయింది..
శిఖిపించసరాగాల విలాసములలో..తేలియాడు సఖి
మది గదిలోదాగిన బావాల పరంపరల ' పలుకు 'ల
తేనెల వానలలో తడిచి ముఖుళించిన అరవిందమైంది..
యముననీటి తరగలపై అలవోకగా నడయాడు పూలనావలో..
సఖుని సందిట బందీఅయిన చెలి ఎరుపెక్కిన చెక్కిళ్ళ ‘ కులుకు ‘
మదన తాపమున మాధవుని కదలనీయక విడివడని జాలమయింది..