26, నవంబర్ 2015, గురువారం

శ్రీ వేంకటేశ్వరుడు
వైకుంఠవాసుడు
శ్రీవేంకటేశ్వరుడు
భగవంతుడు వాడే
పిలిచిన పలికేటివాడు.....
సిరులెన్నొ కలవాడు
శ్రంగార పురుషుడు
శ్రీలక్ష్మి సిగలోన
సిరిమల్లె అయినాడు //వైకుంఠ//
ఏడుకొండెలెక్కి తాను
కొలువై ఉన్నాడు
కోరి వచ్చే వారి..
ఆపద్భాందవుడు //వైకుంఠ//
అల్లనల్లన మెల్లమెల్లగ
అన్నమయ్య హృదయముదోచి
ఆంద్రుల ప్రతి ఇంటను నిలిచి
అవతార మూర్తి అయినాడు //వైకుంఠ//

కామెంట్‌లు లేవు: