10, సెప్టెంబర్ 2015, గురువారం

ఉపశమన తరంగాలు మిత్రులకు సభ్యులకు శుభ సాయంత్రం.. చిత్రాక్షరి-3 రాదా కృష్ణుల వర్ణన . తృతీయ విజేత శ్రీమతి సుజాత తిమ్మన గారు
Sujatha Thimmana **********రాధామనోహరం*********
మోహనుని కొసచూపుల కవ్వింతలు..
రాధ ఎదలోని ప్రేమామృతధారలను 'చిలుకు'తూ
ఉన్న రాసాస్వాదనల తెలియాడుచూ ..తాను మౌని అయింది..
మురళీధరుని గాన విన్యాసముల గాంచుచూ ..
మధువనిలోని పూ భాలల మధువులు 'ఒలుకు '
ప్రణయ వీవనల స్పర్శలో సర్వం మరచిన సరిజమయింది..
శిఖిపించసరాగాల విలాసములలో..తేలియాడు సఖి
మది గదిలోదాగిన బావాల పరంపరల ' పలుకు 'ల
తేనెల వానలలో తడిచి ముఖుళించిన అరవిందమైంది..
యముననీటి తరగలపై అలవోకగా నడయాడు పూలనావలో..
సఖుని సందిట బందీఅయిన చెలి ఎరుపెక్కిన చెక్కిళ్ళ ‘ కులుకు ‘
మదన తాపమున మాధవుని కదలనీయక విడివడని జాలమయింది..

కామెంట్‌లు లేవు: